డిగ్రీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వరకు

డిచ్‌ప‌ల్లి, జూన్ 16

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 23 వరకు, 500 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 25 వరకు,1000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 29 వరకు, 2000 రూపాయల ఆలస్య రుసుముతో వచ్చే నెల 1 వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చ‌ని వ‌ర్సిటి అధికారులు పేర్కొన్నారు.

కావున డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించగలర‌న్నారు.

పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించగలరు.

Check Also

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »