Breaking News

ప్రజలు అన్ని గమనిస్తున్నారు… ఓటుతో సమాధానం చెప్తారు

కామారెడ్డి, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నుర్‌ మండలం కంచర్ల గ్రామానికి చెందిన 18 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.

గ్రామంలో ముందుగా బీజేపీ జండా ఆవిష్కరించిన కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో గ్రామ గ్రామాన బీజేపీ జండా ఎగురుతుందని, ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడాలని అన్నారు.

రిపబ్లిక్‌ డే సందర్భంగా కెసిఆర్‌ ప్రభుత్వం కరోనాను సాకుగా చూపి వేడుకలు చేయకపోవటం విచారకరమని, జాతీయ పండగ విషయంలో రాజకీయాలు చేయటం భావ్యం కాదన్నారు.

పరేడ్‌ గ్రౌండ్‌ సహా జిల్లా కేంద్రాల్లో కూడా ఎలాంటి ఉత్సవాలు చేయలేదని ఇది ఒక రకంగా అధికారులను అవమానించడమే అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఓటుతో సమాధానం చెప్తారని అన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »