వరిధాన్యం నీటిపాలు.. రైతు బతుకు కన్నీటిపాలు

ఎడపల్లి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్టమంతా వృధా అయింది. రాత్రింబవళ్లు పడిన శ్రమంతా నీటిపాలైంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరణుడి ప్రకోపం.. రైతులకు తీరని శోకాన్ని కలిగించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉదయంవరకు కురిసిన భారీ వర్షం .. కర్షకులకు కడగండ్లు మిగిల్చాయి. వేల ఎకరాల్లో పంట నేలవాలింది. ఆరబోసిన ధాన్యం నీట మునిగింది. ధాన్యపు రాశులన్నీ కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోతుంటే ఏం చేయలేని రైతు గుండెలవిసేలా రోదించారు. తన కష్టమంతా అలా నీటిపాలవుతుంటే తట్టుకోలేక.. కన్నీరుమున్నీరయ్యారు.

నోటి కాడికి వస్తున్న కూడును లాగేసుకున్నట్టు.. ఇంకొన్ని రోజులైతే ధాన్యం అమ్ముడుపోయి పైసలు చేతికొస్తాయనుకున్న తరుణంలో ఆ వానదేవుడు తమ ఆశలను నీటిపాలు చేసి.. తన బతుకులను కన్నీటిపాలు చేశాడని విలపిస్తున్నారు.

ఎడపల్లి మండల కేంద్రం శివారులోని శివాలయం, సొసైటీ గోదాం వద్ద అరబోసిన ధాన్యం కుప్పలు భారీ వర్షం దాటికి నీటిలో కొట్టుకుపోయాయి. తడిసిపోయిన దాన్యాన్ని అక్కడినుంచి తరలించేందుకు నానా తిప్పలు పడ్డారు కర్షకులు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించకపోవడంతోనే తమకీ కష్టాలని రైతన్నలు వాపోతున్నారు.

Check Also

ఈనెల 22 వరకు పోషణ పక్షం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »