Breaking News

ఇంటినెంబరు అప్‌డేట్‌ చేసుకోవాలి

కామారెడ్డి, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

18 ఏళ్ల నిండిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మల్టిపుల్‌ పోర్షన్స్‌ ఉన్న ఇల్లు లేదా అపార్ట్మెంట్లలో ఒక ఇంటి నెంబర్‌పై వేరువేరు కుటుంబాలు ఓటర్లుగా నమోదు అయితే ప్రతి ప్లాట్‌, పోర్షన్‌లలో ఉంటున్న కుటుంబానికి ఒక ఇంటి నెంబర్‌ అప్డేట్‌ చేసుకోవాలని తెలిపారు.

ఇంటి నెంబర్‌, సరిjైున చిరునామా అప్డేట్‌ చేయడంలో బిఎల్‌ఓలు తగిన సహకారం అందిస్తారని చెప్పారు. సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సాయి భుజంగరావు, అధికారులు నవీన్‌ కుమార్‌, నరేందర్‌, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »