ఈనెల 6 వరకు పరీక్ష ఫీజు గడవు

డిచ్‌పల్లి, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్స్‌ (5వైఐపిజిపి / పిసిహెచ్‌) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు బ్యాక్‌లాగ్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 వ తేదీ వరకు గడువు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

100 రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 9వ తేదీ వరకు అవకాశం ఉందని సీఈవో పేర్కొన్నారు. కావున అర్హులైన విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సు కు చెందిన (5వైఐపిజిపి) 8వ మరియు 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ ఎం.ఏ. (అప్లయిడ్‌ ఎకనామిక్స్‌) అన్ని సబ్జెక్ట్‌ పరీక్షలకు 500 రూపాయలు చెల్లించాలని, మరియు ఎంఎస్‌సి (ఫార్మాసిటికల్‌ కెమిస్ట్రి) (రెగ్యులర్‌) అన్ని సబ్జెక్టులకు 600 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.

అదేవిధంగా 8వ, 10వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌కి (2016 బ్యాచ్‌ ఆన్‌వర్డ్స్‌) ఎం.ఏ. (అప్లైడ్‌ ఎకనామిక్స్‌) ఒక సబ్జెక్టుకి 150 రూపాయలు, రెండు సబ్జెక్ట్‌లకు 300 రూపాయలు, రెండు సబ్జెక్టుల కంటే ఎక్కువగా ఉంటే 500రూపాయలు చెల్లించాలని అన్నారు. ఎం.ఎస్‌సి (ఫార్మాసిటికల్‌ కెమిస్ట్రీ) కి చెందిన ఒక సబ్జెక్టుకి 175 రూపాయలు, రెండు సబ్జెక్టులకు 350 రూపాయలు, రెండు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే 600 రూపాయలు చెల్లించాలని సిఓఇ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ని సంప్రదించాలని కోరారు.

Check Also

ఈనెల 22 వరకు పోషణ పక్షం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »