బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన కాసుల రోహిత్‌

బాన్సువాడ, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన గుత్తి మల్లు కొండకు చెందిన నివాసపు ఇల్లు ఇటీవల భారీ వర్షాలకు కూలిపోవడంతో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు కాసుల రోహిత్‌ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం వారిని పరామర్శించిన పాపాన పోలేదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రూపాయలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొంతురం కాశిరాం, నాయకులు పుల్లని పేరయ్య, బోయిని గంగాధర్‌ ,మహ్మద్‌, రమేష్‌ నీరడి, సాయిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »