సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు సన్మానం

కామారెడ్డి, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా కలెక్టర్‌ ఆఫీస్‌ నుండి బదిలీపై వచ్చిన ఎమ్మార్వో జానకిని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇన్చార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఎమ్మార్వో కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.

రైతు సమస్యలు భవిష్యత్తులో ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం ధరణి వ్యవస్థను తీసుకొచ్చిందని, ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సులభతరం అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో కూడా ధరణి యాప్‌ ద్వారా ఫోన్‌లో కూడా భూమి వివరాలు చూసుకోవచ్చని అన్నారు. త్వరలోనే పాత పెండిరగ్‌ భూముల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. రైతులు రిజిస్ట్రేషన్‌కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని అన్నారు.

రాజంపేట మండలం రైతులకు రెవెన్యూ పరంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రతినిధులు చేస్తున్న స్వచ్చంద సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు మోతే లావణ్య, మెత్తల అనిల్‌ పటేల్‌, గోల్కొండ యాదమ్మ, పందుల చిన్నస్వామి, రాజిరెడ్డి, మనోహర్‌ రెడ్డి, రాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »