న్యాయవాదులు ఈ పైలింగ్‌ నమోదు చేసుకోవాలి….

నిజామాబాద్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఈ పైలింగ్‌ చేసుకోవాలని బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ కోరారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ కోర్టు వెబ్‌ సైట్‌లో పేరు నమోదు చేసుకుని వెబ్‌ సైట్‌ లోనే సివిల్‌ దావాలు, క్రిమినల్‌ కేసులలో బెయిలు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు అవుతుందని ఆయన తెలిపారు.

ప్రతి న్యాయవాది ఇ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్ర హై కోర్టు ఆదేశం మేరకు జనవరి 15 లోగా న్యాయవాదులు అందరు తప్పక ఈ ఫైళ్లింగ్‌ చేసుకోవాలని సూచించారు. అట్లాగే బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ ఆదేశం మేరకు న్యాయవాదులందరూ డిసెంబర్‌ 31 లోపు సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ రెన్యువల్‌ సంబంధిత సర్టిఫికెట్లతో అప్లికేషన్లు బార్‌ కౌన్సిల్లో దరఖాస్తు చేసుకోవాలని న్యాయవాదులు అందరు తప్పక తమ వృత్తి నిర్వహణ సర్టిఫికెట్లను పొందాలని కోరారు.

Check Also

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »