ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గురువారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అస్పృశ్యత, అంటరానితనం, కులవివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి ఆధిపత్య వర్గాల సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, వాటిని లెక్కచేయకుండా మహిళల విద్యాభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. ఆ మహనీయురాలి స్పూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, అప్పుడే ఆమె ఆశయ సాధనకు కృషి చేసినట్లు అవుతుందని అన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకనుండి ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా జనవరి 3 వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయినులుగా ఎంపికైన సాలూర ఎం.ఈ.ఓ మంజూష, వేల్పూర్‌ ఎం.ఈ.ఓ రేణుక, సుద్దపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల పీ.డీ సంధ్యారాణి, నాగారం ఉర్దూ మీడియం రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన హలీమా బేగం, బాల్కొండలోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాల ఉపాధ్యాయిని ఎల్‌.ఉమాదేవి, జూనియర్‌ లెక్చరర్‌ నూరున్నీసా బేగం, జాతీయ గ్రహీత విజయలక్ష్మి, రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన ఏ.స్వరూపలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌, జిల్లా ఇన్ఫర్మేటిక్‌ ఆఫీసర్‌ మధు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజశ్రీ, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పంటల పరిరక్షణే ప్రభుత్వ కర్తవ్యం

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేతికొచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »