రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి…

కామారెడ్డి, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం సదాశివనగర్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో కొద్ది సేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలపై చర్చించారు. 100 శాతం సర్వే చేయాలని తెలిపారు.

అనంతరం సదాశివ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఔషదాలు ర్యాక్‌లో ఏర్పాటుచేయాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్‌ మాట్లాడి, వైద్య సేవలు ఎలా ఉన్నాయి అని అడిగారు. ఆసుపత్రిలోని వాక్సినేషన్‌, స్టోర్‌ రూం, లేబర్‌ రూం, వార్డ్స, లను కలెక్టర్‌ పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌లను పరిశీలించారు.

కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, జడ్పీ సీఈవో చందర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్‌ బాబు, తహసీల్దార్‌ గంగాసాగర్‌, ఎంపీడీఓ సంతోష్‌, మెడికల్‌ ఆఫీసర్‌ ఆస్మా అఫ్షీమ్‌, వ్యవసాయ, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

Print 🖨 PDF 📄 eBook 📱 భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »