అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం….

బాన్సువాడ, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన వారిని గుర్తించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ రేషన్‌ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియని, రేషన్‌ కార్డుల పై ఎవరు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ప్రకటన కూడా చేసిందన్నారు.

కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దిన్‌, ఉప తహసిల్దార్‌ గంగ ప్రసాద్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, ఆర్‌ఐ అశోక్‌,నాయకులు గోపాల్‌ రెడ్డి, గంగుల గంగారం, కుమ్మరి రాజు ,విట్టల్‌ రెడ్డి, జనార్ధన్‌ గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, రహెల బేగం, నవీన్‌ గౌడ్‌, సృజన్‌ రెడ్డి, ఏఈఓ రాణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి నుండి భూభారతి అవగాహన సదస్సులు…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »