కామారెడ్డి, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పద్మపాణి సొసైటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ సంయుక్తంగా కామారెడ్డిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
క్యాన్సర్ ప్రభావం, లక్షణాలు, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు పోస్టర్లు ప్రదర్శించారు. క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని విద్యార్థులు సందేశం ఇచ్చారు.
కార్యక్రమంలో పద్మపాణి సొసైటీ డైరెక్టర్ స్వర్ణలత, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ యాజమాన్యం పున్న రాజేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.