సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో సోమవారము ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్‌ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ ఈ ఓ రవి మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్‌, శ్యామల ఆశా కార్యకర్తలు మమత నవ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం…

Print 🖨 PDF 📄 eBook 📱 కామరెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »