కొత్త డైట్‌ మెనూ అమలు పరచాలి

కామరెడ్డి, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్‌ మెనూ అమలు పరచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఫుడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్‌ మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.

వసతి గృహాల్లో అవసరమైన పనుల ప్రతిపాదనల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సీ, బి.సి., మైనారిటీ సంక్షేమ అధికారులు రజిత, స్రవంతి, దయానంద్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారిని శిరీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

Print 🖨 PDF 📄 eBook 📱 భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »