కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గం కామారెడ్డి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటెషన్ కేంద్రంలో 94 మంది తమ ఓటు హక్కు వినియోగించు కున్నారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో 126 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల వ్యవధిలో 94 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.