మాడల్‌ ఇంటి నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మాడల్‌ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతీ మండలంలో నిర్మించే ఇందిరమ్మ మాడల్‌ ఇంటి నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిరుపేదలకు ప్రాధాన్యత కల్పించాలని, ఇళ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతించాలని తెలిపారు. కొత్త మండలాల్లో మాడల్‌ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌, జడ్పీ సీఈవో చందర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, గృహనిర్మాణ శాఖ ఈఈ విజయపాల్‌ రెడ్డి, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »