నిజామాబాద్, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మార్చి 10వ తేదీ నుండి ఇంటర్ సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి తిరుమలపుడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జిల్లా విద్య అధికారి కార్యాలయం లోని మూల్యాంకన కేంద్రంలో సంస్కృతం బోధించే అధ్యాపకులు అందరూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
అన్ని ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న అధ్యాపకులు వెంటనే తమ కాలేజ్ లాగిన్ ల నుండి నియామక పత్రాలను ప్రింట్ తీసుకొని పదవ తేదీన మూల్యాంకన కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులను వెంటనే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు రిలీవ్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి ఆదేశించారు.
సంస్కృతం బోధించే అధ్యాపకులను వెంటనే రిలీవ్ చేయని కళాశాలల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లపై ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్య అధికారి స్పష్టం చేశారు.