పసుపు పంట విక్రయాలపై పకడ్బందీ పర్యవేక్షణ

నిజామాబాద్‌, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌ లో పసుపు పంట విక్రయాలపై గట్టి పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా వారు మోసాలకు గురి కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. పసుపు క్రయ విక్రయాల నిశిత పరిశీలనకై సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కృషి చేస్తారని అన్నారు.

Check Also

విజయవంతంగా ముగిసిన అంతర్‌ జిల్లాల యువ ఎక్స్చేంజ్‌ కార్యక్రమం

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »