స్కూల్‌లో సమస్యలుంటే చెప్పండి…

కామారెడ్డి, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కంటి చూపు సమస్యలను పరిశీలించి అవసరమైన వారికి కళ్ల జోళ్లు అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం భిక్నూర్‌ మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతి రావు ఫూలే బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో దృష్టి లోపం కలిగిన విద్యార్థినులకు కళ్ల జోళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగిందని. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్రీయ బాల స్వస్త్‌ కార్యక్రమం క్రింద జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుచున్నదని, దృష్టి లోపం కలిగిన విద్యార్థులకు కళ్ల జోళ్లను ఉచితంగా అందించడం జరుగుతున్నదని తెలిపారు.

స్కూల్‌లో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఆప్తమాలిస్ట్‌ డాక్టర్‌ రవీందర్‌, ఆర్బ్‌ ఎస్కే డాక్టర్‌ మనోజ్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విజయ మహాలక్ష్మి, ప్రిన్సిపాల్‌ విమలా దేవి, తహసీల్దార్‌ శివ ప్రసాద్‌, ఎంపీడీఓ రవికిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

విజయవంతంగా ముగిసిన అంతర్‌ జిల్లాల యువ ఎక్స్చేంజ్‌ కార్యక్రమం

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »