Breaking News

ఆగస్ట్‌ 9 నుంచి డిగ్రీ నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్య ప్రణాళికను అనుసరించి బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఆగస్ట్‌ 5 నుంచి 13 వ తేదీ వరకు తేదీలలో మార్పు జరిగిందని, పరీక్షలను ఆగస్ట్‌ 9 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్‌ – షెడ్యూల్‌ విడుదల చేశారు.

కొవిద్‌ – 19 నిబంధనలను అనుసరించి విద్యార్థుల సౌలభ్యం కోసం 47 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో కొవిద్‌ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్‌ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు.

ఆరు అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని హెచ్చరించారు. కావున డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌లో సంప్రదించాలన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »