మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

కాగా, మహిళా ఉద్యోగులు ఇంటి పనులు, ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ హితవు పలికారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను, వివిధ రంగాలలో ప్రముఖంగా సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్‌ బీ, జిల్లా పౌర సంబంధాల అధికారిణి నార్ల పద్మశ్రీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, టీఎన్జీవో జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుమన్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తపస్‌ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »