నిజామాబాద్, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1 బీ, హిస్టరీ, జూవలజి పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. మొత్తం 651 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197మంది విద్యార్థులకు గాను 17,546 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 96.4 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని అన్నారు.
జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 53 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దిన్ అస్లాం, కనకమహా లక్ష్మి, ముగ్గురు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు, హై పవర్ శ్రీనాథ్ కమిటీ, బల్క్ అధికారి బుద్దిరాజ్లు, కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారు.
జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని వెక్టార్ జూనియర్ కళాశాల, నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల రెండు పరీక్ష కేంద్రాలను, జూనియర్ కళాశాల, రెండు ఎస్ ఆర్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, అల్ఫోర్స్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.
హై పవర్ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో 5 జూనియర్ కళాశాలలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుదిన్ అస్లాం, కనకమహాలక్ష్మి 16 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నర్సయ్య, బాలాజీ, యమున బృందం 16 పరీక్ష కేంద్రాలను, సిటింగ్ స్కాడ్ బృందాలు ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బల్క్ అధికారి బుద్ధిరాజ్ ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.