నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో మిషన్‌ భగీరథ, మెడికల్‌ కళాశాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కళాశాలకు అవసరమైన నీటి సరఫరాకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.

Check Also

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »