కామారెడ్డికి కొత్త నీటి ట్యాంకర్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు బుధవారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, పట్టణంలో నీటి సరఫరాకు కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలో ఇప్పటికే 8 ట్యాంకర్ల ద్వారా ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్న వార్డుల్లో నీటిని సరఫరా చేయడం జరుగుతున్నదని, పట్టణ విస్తీర్ణం పెరగడం, నీటి ఎద్దడి తలెత్తడంతో కొత్తగా 50 లక్షల రూపాయలతో ఐదు నీటి ట్యాంకర్లు కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

అనంతరం హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలోని మున్సిపల్‌ బోర్ల నుండి నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న వాటిని కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మొక్కలను నాటి నీరుపోశారు.

కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చందర్‌ నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌ రెడ్డి, హౌసింగ్‌ పిడి విజయ్‌ పాల్‌ రెడ్డి, మున్సిపల్‌ ఏఈ శంకర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »