భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌

భీంగల్‌, ఏప్రిల్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ స్టేషన్‌ మొత్తం కలియ తిరిగి పోలీస్‌ స్టేషన్‌ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్‌ సెంటర్‌ పనితీరును, కంప్యూటర్‌ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.

5ఎస్‌ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు. వాహనాల పార్కింగ్‌ చూసారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్‌ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.

గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్‌ చేయాలని తెలిపారు. దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సైబర్‌ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

గెమింగ్‌ అప్‌ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సిబ్బంది సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆర్మూర్‌ ఏ.సి.పి వెంకటేశ్వర్లు, ఆర్మూర్‌ రూరల్‌ సి.ఐ. శ్రీధర్‌ రెడ్డి, భీంగల్‌ సి.ఐ. సత్యనారాయణ, భీంగల్‌ ఎస్‌.ఐ జి.మహేష్‌, కమ్మర్పల్లి ఎస్‌.ఐ జి.అనిల్‌ కుమార్‌, ఎర్గట్ల ఎస్‌.ఐ రాము, మోర్తాడు ఎస్‌.ఐ విక్రమ్‌, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్‌ వ్యవస్థ

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »