ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ఏరియాలో ఎకో టూరిజం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడిరచారు. ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ నిలిచే నందిపేట మండలం ఉమ్మెడ, జలాల్పూర్‌ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్‌ రంజిత్‌ నాయక్‌ తో కలిసి సీసీఎఫ్‌ చంద్రశేఖర్‌ రెడ్డి మంగళవారం నిజామాబాద్‌ పర్యటనకు విచ్చేశారు.

ఎకో టూరిజం అభివృద్ధి చర్యలలో భాగంగా 25 సఫారీ వాహనాలను కొనుగోలు చేశామన్నారు. ఎకో టూరిజం అభివృద్ధితో ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. నందిపేటలో ఎకో టూరిజం అభివృద్ధి పనులలో భాగంగా సఫారీ వాహనాల కొనుగోలు, వాచ్‌ టవర్‌, పార్కింగ్‌ ప్రదేశం, రెస్టారెంట్లను మొదటగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ఏరియాలు అయిన ఉమ్మెడలో 1.20 ఎకరాలు, జలాల్పూర్‌ లో 3 ఎకరాలలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.

ఉమ్మెడ నుండి బాసర వరకు బోటింగ్‌ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తామని అన్నారు. అలాగే ఉమ్మెడ నుండి గాదెపల్లి వరకు – 20 కి.మీ, గాదెపల్లి నుండి జలాల్పూర్‌ వరకు – 16 కి మీ సఫారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. 3 రోజులలో సమగ్ర ప్రణాళికలు, కావల్సిన నిధుల వివరాలతో నివేదిక సమర్పిస్తే, వెంటనే బడ్జెట్‌ విడుదల చేస్తామన్నారు. ఈ సమీక్షలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనా, ఆర్డీఓ రాజాగౌడ్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

వడదెబ్బ నుండి రక్షించుకుందాం…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »