తిరుమలకు సొంత కార్లలో వెళ్ళే యాత్రికులకు విజ్ఞప్తి

ఇటీవల ఎండాకాలంలో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయినాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయినాయి.

ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే కింది కారణాలు తెలియజేశారు. అందరూ తప్పనిసరిగా పాటించాలని మా విజ్ఞప్తి.

దీర్ఘదూర ప్రయాణం :

500 కిమీ లాంటి ప్రయాణం తర్వాత ఇంజిన్‌ ఆప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది.
తక్షణమే తిరుమల ఘాట్‌ పైకెక్కడం ప్రారంభిస్తే, ఇంజిన్‌ మరియు ట్రాన్స్‌మిషన్‌కు అధిక వేడి వస్తుంది.

కొండలు, వంకర రోడ్లు :

ఘాట్‌ రోడ్లకు అధిక ఇంజిన్‌ శక్తి అవసరం.
డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు, ఇది ఆర్‌పిఎం పెరిగి వేడి పెరుగుతుంది.
దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్‌ చేయడం వల్ల బ్రేక్‌ సిస్టమ్‌ వేడిగా మారుతుంది.

అధిక లోడుతో వెళ్ళే వాహనాలు :

తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణం.
ఇది ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుంది.

పూర్‌ మెయింటెన్‌ వాహనాలు :

పాత వాహనాలు లేదా సరిగా సర్వీస్‌ చేయని వాహనాలలో:
కూలంట్‌ లీక్‌లు లేదా తక్కువ స్థాయి కూలంట్‌
పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు
ఫాల్టీ థర్మోస్టాట్లు
పొడిసిపోయిన ఇంజిన్‌ ఆయిల్‌ ..

వంటివి ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంజిన్‌ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయి.

ఇంధన లేదా ఎలక్ట్రికల్‌ సమస్యలు :

ఇంధన పైపుల లీక్‌లు లేదా షార్ట్‌ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు పెటించవచ్చు.
దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు మరియు వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయి.

ఘాట్‌ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపడం :

కొంతమంది డ్రైవర్లు ఘాట్‌ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్‌ ఆఫ్‌ చేస్తారు.
దీని వలన ఫ్యాన్‌ పని చేయదు, వేడి బయటకు వెళ్లదు, ఫలితంగా హీట్‌ సోక్‌ జరిగి మంటలు రావచ్చు.

భద్రతా సూచనలు :

Check Also

భూభారతితో నిర్దిష్ట గడువులోపు భూ సమస్యల పరిష్కారం

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దిష్ట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »