నిజామాబాద్, ఏప్రిల్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
లండన్లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్ విద్యార్థి వీసాపై జనవరిలో లండన్ వెళ్ళాడు. యూకేలోని కార్డిఫ్ ప్రాంతంలో ఈనెల 25న సాయంత్రం నుంచి తన కుమారుడు జాడ తెలియకుండా పోయాడని హరిత తన వినతిపత్రంలో తెలిపారు.
వెంటనే స్పందించిన ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), జిఎడి ఎన్నారై అధికారులతో మాట్లాడారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢల్లీిలోని విదేశాంగ శాఖకు, లండన్లోని ఇండియన్ హై కమీషన్కు లేఖలు రాశారు.