నిజామాబాద్, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు.
ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈవీఎం ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, విజయేందర్ తదితరులు ఉన్నారు.