కామారెడ్డి, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మంగళవారం రాత్రి అకాల వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను, కళ్ళల్లో తడిసిన వడ్లను పరిశీలించడానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి బుధవారం అడ్లూర్, చిన్న మల్లారెడ్డి, తలమడ్ల గ్రామాల్లో వడ్ల కళ్ళల వద్దకి వెళ్లి రైతులతో మాట్లాడారు.
మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల ఇంకా కోత కానీ వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని, నష్టపోయిన పంటకి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలనీ డిమాండ్ చేశారు. అధికారులు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలనీ కోరారు. కళ్ళములో తడిసిన సంచులను రైస్ మిల్లర్లు దించుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా కాంట పూర్తి చేయాలనీ అన్నారు. తూకం వేసిన వడ్లు సాధ్యమైనంత తొందర రైస్ మిల్లులకు తరలించాలనీ అన్నారు.