జూన్‌ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు?

హైదరాబాద్‌, మే 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్‌ 8న రాష్ట్రాన్ని తాకాయి.

అదే ఈ ఏడాది మే 27నే కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండి అంచనా వేయడంతో జూన్‌ 5 లోపే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి ఇప్పటికే ప్రకటించింది.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, మే.14, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »