హైదరాబాద్, మే 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్ 8న రాష్ట్రాన్ని తాకాయి.
అదే ఈ ఏడాది మే 27నే కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండి అంచనా వేయడంతో జూన్ 5 లోపే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి ఇప్పటికే ప్రకటించింది.