Breaking News

మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ

గాంధారి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులవృత్తుల ఉపాధిలో భాగంగా మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు గాంధారి ఎంపీపీ రాధా బలరాం నాయక్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం వద్ద మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను బెస్త, ముదిరాజ్‌లకు అందజేశారు.

మండలం కేంద్రంతో పాటు గండివేట్‌, పొతంగల్‌, ముదెల్లి, సితాయిపల్లి, గౌరారం గ్రామాలలో గల చెరువులలో వదలడానికి 11 లక్షల 74 వేల 490 చేపపిల్లలను అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గోవర్ధన్‌, ఎంపీడీఓ సతీష్‌, సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, బాలరాజ్‌, నాయకులు సత్యం, మత్స్య శాఖ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Check Also

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »