Breaking News

అరెస్టులు చేయడం పిరికిపంద చర్య

కామారెడ్డి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గజ్వెల్‌ నియోజక వర్గం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ ఉన్న ఎర్రవెల్లిలో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న రేవంత్‌ రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను అరెస్ట్‌ చేయడం పనికిమాలిన చర్య, పిరికిపంద చర్య అని మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు.

ఎర్రవెల్లి కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానని రేవంత్‌ రెడ్డి వెల్లడిరచడంతో కేసీఆర్‌ వెన్నులో వణుకు పుట్టిందని, అర్థరాత్రి నుంచే రేవంత్‌ రెడ్డి ఇంటి ముందు పోలీసుల పహరగా ఉంటూ ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదన్నారు.

ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌, మోడీలను ప్రజల కోర్టులో దోషిగా నిలబెడుతామని షబ్బీర్‌ స్పష్టం చేసారు. ఏది ఏమైనా రైతులపక్షాన పోరాడే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీయేనని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల కొరకు దండయాత్ర మొదలుపెడతాం అన్నారు.

Check Also

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »