Breaking News

స్పెషల్‌ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మార్చి 11 చివరితేదీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నిర్వహించే స్పెషల్‌ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరితేదీ మార్చి 11 అని అధ్యయన కేంద్ర రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మానసికంగా చెవులకు, కళ్ళు సంబంధిత అంగవైకల్యంతో ఉన్న పిల్లలకు బోధించడానికి స్పెషల్‌ బి.ఇడి ఉపయోగపడుతుందన్నారు. బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సి., బి.సి.ఏ., బి.బి.ఎం., బి.ఇ., బి.టెక్‌., డిగ్రీలో 50 శాతంతో పాసైనవారు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి వారు 40 శాతంతో పాసైనవారు ప్రవేశ పరీక్ష రాయవచ్చన్నారు.

యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా మీసేవా కేంద్రంలో రూ. 600 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మార్చి 20వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం జి.జి. కాలేజ్‌ అధ్యయన కేంద్రంలో సంప్రదించాలన్నారు.

Check Also

ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »