భీంగల్‌ పురపాలక సంఘం చైర్‌ పర్సన్‌కి సన్మానం

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణ కేంద్రంలో మంత్రివర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నికలు నిర్వహించగా అభ్యర్థులు 1వ వార్డ్‌ కౌన్సిలర్‌ కన్నె ప్రేమలత – సురేంధర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా శనివారం రాత్రి 1వ వార్డ్‌ పట్టణ ప్రజలు వీరికి అభినందన సభ ఏర్పాటు చేశారు. సభలో వారిని పట్టణ కేంద్రానికి చెందిన న్యూ ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ,భీంగల్‌ వారు గజ మాల, శాలువాతో సన్మానించారు. అనంతరం 1వ వార్డ్‌ మహిళలు మాట్లాడుతూ వేముల ప్రశాంత్‌ రెడ్డి అండతో కన్నె ప్రేమలతకి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పదవి దక్కడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వార్డ్‌ అధ్యక్షుడు శ్రీపాద గోపి, సభ్యులు రమేష్‌, శ్యామ్‌, అరెపల్లి నరేందర్‌, బుర్ర శ్రీనివాస్‌ గౌడ్‌, దాస్‌, న్యూ ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావుట్ల అరవింద్‌, సభ్యులు కొండూరు హరీష్‌, ముత్యం, సంజయ్‌, నగేష్‌, ప్రశాంత్‌, రాజు, నవీన్‌, రవీందర్‌, సాగర్‌, కాలనీ మహిళలు, యూత్‌ సభ్యులు, సీనియర్‌ సిటీజన్స్‌, వ్యాపార వేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.

Check Also

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »