NizamabadNews

పోలీస్‌ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ…

బాన్సువాడ, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి పోలీసు వాహనం అంబేద్కర్‌ చౌరస్తా నుండి పాత బాన్సువాడకు వెళ్ళుచుండగా బాన్సువాడ నుండి నిజామాబాద్‌ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్‌ జీవును ఢీకొనడంతో పోలీసు వాహనం దెబ్బతిన్నదని పట్టణ సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. లారీ డ్రైవర్‌ పారిపోవడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ …

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక పూర్తి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పధకం క్రింది 1వ, 5వ తరగతిలో ప్రవేశాలకై గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. 1వ తరగతిలో 64 సీట్లకు, 70 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా లక్కీ డ్రా ద్వారా …

Read More »

ఓటింగ్‌ యంత్రాలపై చైతన్యం పొందాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటింగ్‌ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించుటకు గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం., వివి ప్యాడ్‌ ల ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ యంత్రాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటింగ్‌ యంత్రాలపై …

Read More »

అదనపు కలెక్టర్‌ను కలిసిన రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు గురువారం సమీకృత జిల్లా కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ పి యాదిరెడ్డిని ఆయన చాంబర్‌ లో మర్యాద పూర్వకంగా కలిశారు. అదనపు కలెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్‌ ను కలిసిన వారిలో రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్‌ తదితరులు …

Read More »

ఎన్నికలపై అవగాహన కోసం ప్రచార రథాలు

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలలో పాల్గొనాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సంచార ప్రచార రథాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశామని ఈ …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల …

Read More »

ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌.మధుసూదన్‌ రావు తెలిపారు. వర్షాల వల్ల ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌: 08462 – 221403 కు ఫోన్‌ చేసి …

Read More »

ఐ.డీ.ఓ.సి లో మొక్కలు నాటిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం మొక్కలు నాటారు. కార్యాలయం ఆవరణలో అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు …

Read More »

నేటి పంచాంగం

గురువారం జూలై 20, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం, వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం, శుక్ల పక్షంతిథి : తదియ తెల్లవారుజాము 3.13 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 9.40 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.06 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 3.13 వరకు తదుపరి గరజి తెల్లవారుజాము 3.13 వరకువర్జ్యం : రాత్రి 10.58 – 12.44దుర్ముహూర్తము : ఉదయం 9.56 – …

Read More »

వర్షాల నేపథ్యంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌ 08462 – 220183 కు ఫోన్‌ చేసి సమాచారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »