కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లాలో మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి మరో రెండు వసతి గృహాలు
డిచ్పల్లి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీకి ఒక బాలుర వసతి గృహం, ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాలు గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. …
Read More »అనారోగ్య బాధితుడికి రూ.2 లక్షల ఎల్వోసీ
ఆర్మూర్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన డీ ఆర్ ఆర్ శశాంక్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. …
Read More »ఘనంగా మంచినీళ్ల పండగ..
బాన్సువాడ, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణ నగర్ తండాలో ఆదివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రేమ్ సింగ్ ఆధ్వర్యంలో మంచినీటి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులకు పూలతో అలంకరించి నల్లాలకు పూజలు చేసి అనంతరం గ్రామంలో ర్యాలీగా వెళ్లి గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి …
Read More »ఇందూరుకు ఆధ్యాత్మిక సంపద నర్సింహారెడ్డి
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలంలోని నర్సింగపల్లి ఇందూరు తిరుమల ఆలయంలో జరిగిన హరినామ చింతన కార్యక్రమంలో నర్సింహా రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు పమిడికాల్వ మధుసూదన్చ, విశిష్ట అతిథిగా ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ఇందూరులో అన్నమయ్య మళ్లీ పుట్టాడని, నాడు అన్నమయ్య ఏడుకొండల వాడిపై …
Read More »ప్రజావాణి వాయిదా
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జూన్ 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం : గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం : బహుళ పక్షంతిథి : అమావాస్య ఉదయం 8.52 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మృగశిర సాయంత్రం 5.28 వరకుయోగం : గండం రాత్రి 12.52 వరకుకరణం : నాగవ ఉదయం 8.52 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 9.20 వరకువర్జ్యం : రాత్రి 2.28 – 4.11దుర్ముహూర్తము : సాయంత్రం 4.47 …
Read More »శిశుమందిర్కు ఆటవస్తుల విరాళం
బాన్సువాడ, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులను శనివారం బాన్సువాడ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. బాల్కమల్ ఆస్పత్రి డాక్టర్ తోటవారి కిరణ్ కుమార్ తన తోటి డాక్టర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతో లక్ష రూపాయల విలువచేసే ఆట వస్తువులను పాఠశాలకు అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం డాక్టర్లను అభినందించారు. ఈ …
Read More »బక్రీద్ శాంతియుతంగా నిర్వహించాలి
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ పండగ వేడుకులు శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డివిజన్ స్థాయిలో శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈనెల 29న జరిగే బక్రీద్ పండుగ ఏర్పాట్లకు మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు …
Read More »దర్పల్లిలో కాంగ్రెస్ సమావేశం
ధర్పల్లి జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ భూపతి రెడ్డి విచ్చేసి మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదని కార్యకర్తలకు దీమా కల్పించారు. ఎవరైనా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు …
Read More »