NizamabadNews

పేదల ముంగిట్లోకి కార్పొరేట్‌ వైద్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు సైతం కార్పొరేట్‌ తరహా వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తేవాలనే మానవీయ కోణంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రూ. 2 కోట్ల 14 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన …

Read More »

ఆదర్శం… జర్నలిస్ట్‌ కాలనీ

ఆర్మూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుంటూ జర్నలిస్ట్‌ కాలనీవాసులు ఆర్మూర్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారని పురపాలక చైర్‌ పర్సన్‌ పండిత్‌ వినీత ప్రశంసించారు. జర్నలిస్ట్‌ కాలనీలో ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛకాలనీ సమైక్య కాలనీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాలనీవాసులతో కలిసి ఆమె ఉద్యానవనంలో పిచ్చిమొక్కలను …

Read More »

ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల …

Read More »

ఆర్మూర్‌లో ఘనంగా సావర్కర్‌ జయంతి

ఆర్మూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర వీరసావర్కర్‌ 140 వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వీర సావర్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ …

Read More »

జూన్‌ 4న బహిరంగ సభ

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం చలో కొత్తగూడెం సిపిఐ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడారు. బిజెపి హటావో దేశ్‌ బచావో నినాదంతో ఏప్రిల్‌ 14వ తేదీ నుండి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గడపగడపకు గ్రామ గ్రామాన బిజెపి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న …

Read More »

18న క్విజ్‌ పోటీలు

బాన్సువాడ, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్స్‌వాడ పట్టణంలో యూత్‌ డిక్లరేషన్‌లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాజీవ్‌గాంధీ యూత్‌ డిక్లరేషన్‌ క్విజ్‌ పోటీలు 16 నుండీ 35 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కాంపిటీషన్‌ పోటీలు వర్తిస్తుందని శనివారం ప్రచారం నిర్వహించారు. క్విజ్‌ కాంపిటీషన్‌ పోటీలు 17 వరకు రిజిస్ట్రేషన్‌, 18న పోటీలు నిర్వహించబడుతుందని కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కాసుల రోహిత్‌, …

Read More »

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో బీజేపీ ఆర్మూర్‌ మండల కార్యవర్గ సమావేశం శనివారం ఆర్మూర్‌ మండల అధ్యక్షులు తొర్తి రోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పాలెం రాజు, జిల్లా కిసాన్‌ మోర్చ అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, అలాగే 2018 ఎన్నికల …

Read More »

ఘనంగా ఉత్సవాలు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న నుంచి 22 వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జూన్‌ 2న జరిగే …

Read More »

దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలి

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. జూన్‌ 2 నుండి 22 వ తేదీ వరకు ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇంచార్జ్‌ పోలీస్‌ …

Read More »

ముందస్తుగా పంట వేయడమే మార్గం

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగానికి జీవన్మరణ సమస్యగా పరిణమించిన ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను అధిగమించేందుకు ముందస్తుగా పంట వేసుకోవడం ఉత్తమ మార్గమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. వానాకాలం పంటను జూన్‌ మొదటి వారం నాటికే విత్తుకోవాలని, యాసంగి పంటను మార్చి నెల 15వ తేదీ లోపు నాటడం పూర్తి చేసుకోవాలని సూచించారు. దీనివల్ల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »