NizamabadNews

ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

ఆర్మూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామములో నాయకపోడ్‌ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమనికి గ్రామసర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని …

Read More »

విడిసి ఆగడాలు హద్ధులు మీరుతున్నాయి

ఆర్మూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం కోమన్‌ పల్లి గ్రామానికి చెందిన గొల్ల కురుమ, నాయక పోడు కుటుంబాలను గ్రామ విడిసి సాంఘిక కుల బహిష్కరణ చేయడంతో అవస్థలకు గురవుతున్నారు. బాధిత కులసంఘాల కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. కోమన్‌పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన సుబ్బిర్యాల్‌ గ్రామానికి చెందిన ఎమ్‌ఎన్‌ గంగారెడ్డికి సుమారు 8 ఎకరాల 23 గుంటల స్థలం ఉంది, …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు 10, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : నవమి ఉదయం 7.51 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక ఉదయం 6.58 వరకు తదుపరి రోహిణియోగం : ధృవం రాత్రి 7.59 వరకుకరణం : గరజి ఉదయం 7.51 వరకు తదుపరి వణిజ రాత్రి 7.46 వరకువర్జ్యం : రాత్రి 11.19 – 12.571దుర్ముహూర్తము …

Read More »

తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ కొలువు

బీర్కూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన కీర్తి రాజ్‌ నిరూపించారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళితే పేదరికం అడ్డు రాదని నిరూపించి మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగాన్ని సాధించారు కీర్తి రాజ్‌. ప్రభుత్వం ఇటీవల కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగుల కోసం పరీక్షలు నిర్వహించగా ఎస్సై ఉద్యోగానికి పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే …

Read More »

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

బాన్సువాడ, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్‌ గ్రామానికి చెందిన పసుపుల పసుపుల రాజు చెట్టుకు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పసుపుల రాజు మద్యానికి బానిసై భార్యను విపరీతంగా వేధింపులకు గురి చేయడంతో ఆమె భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ పసుపుల రాజు మద్యానికి బానిసై ఈనెల 6న మద్యం తాగడానికి డబ్బులు కావాలని కుటుంబ సభ్యులను బెదిరించారు. …

Read More »

బిఆర్‌ఎస్‌కు రాజీనామా

ఎల్లారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము లింగంపేట మండలం, మాలోత్‌ తండా గ్రామనికి చెందిన సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్స్‌, పాలకవర్గం మొత్తం బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సునీత ప్రకాష్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ సుమన్‌ నాయక్‌, వార్డ్‌ మెంబర్‌ లాల్‌ సింగ్‌ నాయక్‌, మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ …

Read More »

ప్రభుత్వ పథకాలపై సమీక్ష

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లాకు కేటాయించిన 3. 96 లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారికి తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది సంపద వనాల కింద 8 ప్రాంతాలకు గాను 7 ప్రాంతాలలో మొక్కలు నాటడం పూర్తయిందని, మొక్కల నాటే …

Read More »

ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యతనివ్వాలి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో తమ సమస్యలు విన్నవిస్తే పరిష్కారమవుతాయనే నమ్మకంతో ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించవలసినదిగా జిల్లా పరిషత్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి సాయా గౌడ్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డిఆర్‌ డిఓ సాయన్న, సిపిఒ రాజారామ్‌ లతో కలిసి సమస్యల పరిష్కార …

Read More »

నేత కార్మికులకు అండగా నిలవాలి

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత వస్త్రాలను ధరించి ప్రజలు, నేత కార్మికులకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు.డి ఆర్‌ డి ఒ, చేనేత, జౌళి శాఖ అద్వర్యంలో సోమవారం కామారెడ్డి రోటరీ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారానికి రెండు రోజులు అధికారులు చేనేత వస్త్రాలను …

Read More »

నోటరీ భూముల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ విషయాన్ని ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »