NizamabadNews

లబ్దిదారులకు రుణాలు అందించాలి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పాడి, మత్స్య పరిశ్రమలకు లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం 2023 మార్చి త్రైమాసిక బ్యాంకుల రుణ వితరణ, పనితీరుపై జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. విద్యా రుణాలను ఇవ్వడానికి బ్యాంకర్లు జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌, …

Read More »

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు షురూ…

ఎడపల్లి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో బుధవారం నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపడతామని ఎడపల్లి మండల ప్రత్యేక అధికారి నందకుమారి, ఎంపీడీఓ గోపాల కృష్ణ తెలిపారు. బుధవారం గ్రామాల్లోని అన్ని వీధుల్లో చెత్తాచెదారం తొలగించాలనే ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రపరచారు. కానీ మరికొన్ని గ్రామాల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు కనబడలేదని పలువురు …

Read More »

బతుకమ్మతో విఓఏల నిరసన …

ఎడపల్లి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట ఐకేపి వీఓఏల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా బుధవారం 24వ రోజు సైతం కొనసాగింది. ఈ మేరకు బుధవారం ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కార్యాలయం ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు …

Read More »

ఆడపిల్లలను విక్రయిస్తే కేసులు

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడపిల్లలను విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు అరికెళ్ల దేవయ్య అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా బాలల సంరక్షణ యూనిట్‌, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులు, సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

మొక్కజొన్న పంట దగ్ధం

బాన్సువాడ, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పులిగుండు తండా గ్రామానికి చెందిన ఈషా నాయక్‌ చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట మంగళవారం షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర ఆవేదనలో ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలన్నారు. సమాచారం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో మొక్కజొన్న పంటను పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని ఏఈఓ మీనా తెలిపారు.

Read More »

వ్యవసాయంలో ఏ.ఈ.ఓల పాత్ర క్రియాశీలకం

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సాగు రంగమే ప్రధాన ఆధారంగా ఉన్నందున వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏ.ఈ.ఓలు) క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. క్షేత్రస్థాయిలో అనునిత్యం రైతులను కలుస్తూ, వారి ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా పని చేయాలని హితవు పలికారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల …

Read More »

కామారెడ్డిలో జాబ్‌ మేళా

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేటు రంగములో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19న శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులో గల రూమ్‌ నెంబర్‌ 121 లోని జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం కామారెడ్డిలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనధికారి బి.పి. …

Read More »

పిహెచ్‌.డి.లపై సమగ్ర విచారణ జరపాలి

డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని, ఒకపక్క విసి అక్రమాలు, అవినీతి, విద్యార్థుల దగ్గర డబ్బులు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే మరోవైపు పిహెచ్‌డి స్కాం జరిగిందని, దీనిపై కేవలం ఒక్క విద్యార్థి నాయకుడిపై విచారణ జరపడం సరికాదని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్‌ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …

Read More »

లక్ష జరిమానా

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆహార భద్రత శాఖకు సంబంధించి ఆరు కేసులకు గాను ఆహార పదార్థాల విక్రయ వ్యాపారులకు రూ. లక్ష జరిమానను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ విధించారు. ఆహారపు కల్తీకి పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఆహార పదార్థాల విక్రయ వ్యాపారులు కల్తీలేని నాణ్యత కలిగిన ఆహార ప్రదార్థాలు విక్రయించాలని జిల్లా ఆహార …

Read More »

జాతీయస్థాయికి ఎదగాలి

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బాన్సువాడ, నిజాంసాగర్‌ మండల కేంద్రాల్లో నిర్వహించిన సీఎం క్రీడా పోటీలకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »