ఆర్మూర్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ దిన పత్రికలో పని చేస్తున్న వడ్ల తిరుపతిని నవనాథపురం ప్రెస్క్లబ్ సభ్యులు గత నాలుగు రోజుల క్రితం గాయమైన విషయాన్ని తెలుసుకొని శనివారం ఆయనను పరిమర్శించారు. పరామర్శించిన వారిలో గౌరవ అధ్యక్షుడు సత్పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగమోహన్, ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్దేమ్, సలహాదారుడు కొడిమ్యాల గణేష్ గౌడ్, …
Read More »ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి
నిజామాబాద్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట చేతికందిన దశలో దురదృష్టవశాత్తు కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం యావత్తు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని సూచించారు. …
Read More »జర్నలిస్ట్ను పరామర్శించిన పీవీఆర్
ఆర్మూర్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వడ్ల తిరుపతికి ప్రమాదవశాత్తు చేతికి గాయం అయింది. ఆర్మూర్లోని గంగ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ ఏలేటి అమృత రాంరెడ్డి జర్నలిస్ట్ తిరుపతికి మెరుగైన వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న బిజెపి నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శుక్రవారం మామిడిపల్లిలోని వారి ఇంటికి …
Read More »ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశం
కామారెడ్డి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోల ప్రక్రియ సజావుగా సాగే విధంగా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అధికారులతో పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పాలని అధికారులకు సూచించారు. తడిచిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు పంపించే విధంగా అధికారులు చర్యలు …
Read More »ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
రెంజల్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బొర్గం, పేపర్ మిల్ గ్రామంలో శుక్రవారం బుద్ధ పౌర్ణమి 2567వ బుద్ధ జయంతి వేడుకలను మాలమహనాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలమహనాడు మండల యూత్ అధ్యక్షుడు సిద్ద సాయిలు,అబ్బోల్ల శ్రీకాంత్,కిషన్,రమేష్, చంద్రకాంత్, గౌతమ్ తదితరులు ఉన్నారు.
Read More »అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
రెంజల్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సర్పంచ్ అలిమా ఫారూఖ్ పటేల్ అన్నారు.శుక్రవారం మండలంలోని పేపర్ మిల్ గ్రామంలో విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా నీలీ …
Read More »ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న ఈవీఎంల, వివి ప్యాడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »నర్సరీ నిర్వహణ తీరుపై కలెక్టర్ అసంతృప్తి
నిజామాబాద్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనం పెంపొందించడంలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ గ్రామంలో నెలకొల్పిన హరితహారం నర్సరీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం పట్ల కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశాపూర్ లో కలెక్టర్ శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా, పక్కనే ఉన్న నర్సరీని గమనించి అక్కడికి వెళ్లి పరిశీలించారు. నర్సరీలో విత్తనాలు మొలకెత్తకపోవడం, మొక్కలు …
Read More »ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి
నిజామాబాద్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్, డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం అదనపు కలెక్టర్ …
Read More »ఆర్మూర్లో కొనసాగుతున్న జేపిఎస్ల సమ్మె
ఆర్మూర్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరు పట్టణంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఏడవ రోజు సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో డివిజన్ స్థాయి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేపట్టారు. అంతకుముందు ఇటీవల మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మాపట్ల ప్రభుత్వం వెంటనే స్పందింది జూనియర్ పంచాయతీ …
Read More »