ఎడపల్లి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్యవైశ్య కుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతిని ఎడపల్లి మండలంలో ఆర్యవైశ్య కులసంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య సభ్యులు వాసవీ మాత చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎడపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ …
Read More »కమ్మర్పల్లిలో విఓఏల నిరసన
కమ్మర్పల్లి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద ఏడవ రోజు వివోఎలు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల వివోఎలు నోటికి చేయిపెట్టుకొని మౌనంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వివోఏల మండల అధ్యక్షుడు సుభాష్ మాట్లాడుతూ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, 18 వేల వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని లేనిపక్షంలో సమ్మె ఉదృతం …
Read More »విద్యుత్ షాక్తో గేదె మృతి
కమ్మర్పల్లి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామంలో వడగళ్ల వర్షంతో పాటు ఈదురు గాలులు రావడంతో ఏలేటి రాజనర్సు రైతుకు సంబంధించిన గేదె మృత్యువాత పడిరది. కరెంటు తీగ తెగి గేదె మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందిందని రైతు ఏలేటి రాజనర్సు తెలిపారు.
Read More »మన్ కీ బాత్ వంద పుస్తకాలతో సమానం
నిజామాబాద్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన్ కీ బాత్ 100 ఎపిసోడ్స్ 100 పుస్తకాలతో సమానమని, ఈ 100 ఎపిసోడ్స్లో ప్రధానమంత్రి చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ అన్నారు. నాగారంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. 100 ఎపిసోడ్స్లో ఎన్నో గొప్ప విషయాలను, …
Read More »కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం
నిజామాబాద్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్స్ ఫైనల్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ప్రవీణ్ కుమార్ వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూటుమెంట్ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఫైనల్ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1గంట వరకు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా మొత్తం అభ్యర్థులు 5,285 మంది రాత పరీక్షకు …
Read More »బోధన్లో కార్టన్ సెర్చ్
బోధన్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, గురుగోవింద్ నగర్ కాలనీలో పట్టణ సీఐ ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ఇంటింటిని పరిశీలించి సరైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేపట్టారు. అనంతరం కాలనీలో కమ్యునిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. యువత చెడు …
Read More »దళితరత్న అవార్డు గ్రహీతగా సిద్ధ సాయిలు
రెంజల్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మాల మహానాడు మండల యువజన విభాగం అధ్యక్షుడు సిద్ధ సాయిలు చేసిన సేవలను గుర్తించి అంబేద్కర్ జయంతోత్సవాలను పురస్కరించుకుని శనివారం నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ శేఖర్ చేతుల మీదుగా దళితరత్న అవార్డు అందుకున్నారు. గత దశాబ్ద కాలం నుండి మండలంలో దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను నిర్భయంగా ఎదుర్కొంటున్న …
Read More »నర్సరీ మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలి
బాన్సువాడ, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నర్సరీలో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని బొర్లం గ్రామంలోని గ్రంథాలయాన్ని నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటింటికీ …
Read More »1,64,656 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయింది
నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో యాసంగి 2022-23 సీజన్లో ఇప్పటివరకు 406 కేంద్రాల ద్వారా 20,239మంది రైతుల నుండి 1,64,656 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో …
Read More »గొర్రెల పంపిణీ పథకంపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అమలు తీరుపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం …
Read More »