రెంజల్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటా పూర్ గ్రామపంచాయతీ లో సోమవారం లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ,షాధిముబారక్ చెక్కులను సర్పంచ్ వికార్ పాషా అందజేశారు. అనంతరం సర్పంచ్ వికార్ పాషా మాట్లాడుతూ ప్రతి ఆడపడుచుకు అన్నగా ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటూ ఆడపిల్లల పెళ్లికి కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ ద్వారా ఆర్దిక సహాయం అందజేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే షకీల్అమీర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో కళ్యాణ …
Read More »అన్ని సమస్యల పరిష్కార మార్గం అంబెడ్కరిజమే
ప్రొఫెసర్ లింబాద్రి, చైర్మన్ ఉన్నత విద్యా మండలి నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పరిష్కారానికి అంబెడ్కర్జమే ఏకైక మార్గమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేయడమంటే భవిష్యత్తుకు దిశ మార్గమని అన్నారు. ఆదివారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బహుజన విద్యావంతుల …
Read More »21 నుండి ధ్యాన శిబిరం
కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 21 నుంచి 23 వరకు జరిగే ధ్యాన శిబిరం వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధ్యాన శిబిరం ప్రతినిధులు మాట్లాడారు. హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్ట్యూట్ రామచంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్ ధ్యాన్, అర్ దిల్ ధ్యాన్ ఆసనాలు, ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశుమందిర్ …
Read More »మహిళలకు చక్కటి పొదుపు అవకాశం…
ఆర్మూర్, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, గ్రామాలలోని బ్రాంచ్ పోస్టాఫీసులలో ఎక్కడైనా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టీఫికెట్ – 2023 గురించి సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చని శనివారం నిజామాబాద్, ఆర్మూర్ పోస్టల్ అదనపు ఎస్పీ యాపరు సురేఖ ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ మహిళలకు మరియు ఆడపిల్లలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర …
Read More »యాసంగి బియ్యం గోదాములకు తరలించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 30లోగా 2021-2022 యాసంగి బియ్యంను రైస్ మిల్లుల యజమానులు గోదాములకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం గోదాంల అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కాంట్రాక్టర్లు గోదాములలో ఖాళీ స్థలాలను …
Read More »యువకుడికి రక్తదానం చేసిన అర్థశాస్త్ర అధ్యాపకుడు
కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న యువకుడు చింతల లక్ష్మణ్కి ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభింలేదు. వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో అర్థశాస్త్ర …
Read More »జిల్లా విద్యార్థిని ల్యాప్టాప్ గెలుచుకుంది..
నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర మరియు వారు సాధించిన విజయాలు గురించి రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. దానికి గాను నిజామాబాద్ జిల్లా విద్యార్థిని సునీత, 10 వ తరగతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం, వర్ని ` ఉపన్యాసపోటీలో మొదటి బహుమతి సాధించింది. …
Read More »అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని భావి తరాలకు అందించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని భావితరాలకు అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని కొనియాడారు. జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో అంబేడ్కర్ 132వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. …
Read More »ఘనంగా విశ్వరత్న అంబేద్కర్ జయంతి వేడుకలు
రెంజల్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచమేధావి,విశ్వరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్132వ జయంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ రజినీకిషోర్,సర్పంచ్ రమేష్ కుమార్, మాలమహనాడు జిల్లా ప్రధానకార్యదర్శి జక్కలి సంతోష్ పూలమాలలు వేసి నివాళి ఘటించారు. బొర్గం గ్రామంలో జడ్పీటీసీ విజయసంతోష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాంచందర్ …
Read More »అంబేడ్కర్ జయంతి సందర్బంగా రక్తదానం
కామరెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ప్రాంగణంలో గల విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ జయంతి మహోత్సవం సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్లో ప్రతినిధులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్జీవో ఫౌండర్ …
Read More »