Breaking News

NizamabadNews

చలివేంద్రం ప్రారంభం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్ష స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యములో ఆర్మూర్‌ పట్టణములోని ఖాందేష్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శనివారం ఆర్మూర్‌ నియోజజవర్గ ఇంచార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌ రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడము కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశ్యముతో రక్ష స్వచ్చంధ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు …

Read More »

ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం, మెంట్రాజ్‌ పల్లి గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు …

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

రెంజల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంతోపాటు సాటాపూర్‌, బొర్గం, తాడ్‌ బిలోలి, వీరన్నగుట్ట, నీలా, పేపర్మిల్‌, కందకుర్తి గ్రామాల్లో శనివారం ముస్లిం సోదరులు రంజాన్‌ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల నుండి ఉపవాస దీక్షలు చేపట్టిన మైనార్టీలు నెలమాసం ముగియడంతో శనివారం ఉదయం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎటువంటి …

Read More »

ఆచార్య రవ్వా శ్రీహరి అస్తమయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంస్కృతాంధ్ర సవ్యసాచి, భాషా వేత్త, రచయిత, ఆచార్య రవ్వా శ్రీహరి (79) అస్వస్థతతో శుక్రవారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాదులో కన్నుమూశారు. నేటి యాదాద్రి భువనగిరి జిల్లా మునిపంపుల గ్రామంలో అమ్మమ్మ గారి ఇంట 7 సెప్టెంబర్‌ 1943న జన్మించిన శ్రీహరి తల్లిదండ్రులు వెల్వర్తి,కి చెందిన రవ్వా వెంకట నరసమ్మ ,వెంకట నరసయ్య. మునిపంపులలో ప్రాథమిక విద్య నుండి …

Read More »

ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవరుచుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం సమీపంలో రంజాన్‌ పండుగను పురస్కరించుకొని మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున సేమియాను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్‌ పండుగ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు. సర్వమత సౌబ్రాతృత్వానికి మైనార్టీల …

Read More »

ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ధ్యాన శిబిరం ద్వారా సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కలుగుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు.హార్ట్‌ ఫుల్‌ నెస్‌ ఇనిస్ట్యూట్‌ రామచంద్ర మిషన్‌, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్‌ ధ్యాన్‌, అర్‌ దిల్‌ ధ్యాన్‌ ఆసనాలు , ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశు మందిర్‌ హై స్కూల్‌ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ధ్యాన శిబిరంను జ్యోతి ప్రజ్వలన …

Read More »

గ్రామాల్లో రీడిరగ్‌ రూంలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :గ్రామాల్లో రీడిరగ్‌ రూమ్‌ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా గ్రంధాలయ సమస్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో రీడిరగ్‌ రూమ్‌ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రీడిరగ్‌ రూముల్లో ఫర్నిచర్‌, దినపత్రికలు, మహనీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో …

Read More »

పనులు నాణ్యతతో చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. నాణ్యతగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేవునిపల్లి శివారులో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి భవన నిర్మాణం పనులను చూశారు. పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మెడికల్‌ కళాశాల విద్యార్థుల వసతి గృహాల ఏర్పాటు కోసం రెండు …

Read More »

23న బసవ జయంతి

కామరెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బసవ జయంతి వేడుకలకు అన్ని వర్గాల ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, బహుజన సంఘాల ప్రతినిధులతో బసవ జయంతి వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 23న కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల …

Read More »

జిల్లా ప్రజలకు ప్రముఖుల రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని అన్నారు. ఉపవాస దీక్షల పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »