కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో …
Read More »నిస్వార్థ సేవకులే రక్తదాతలు..
కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన నవనీతకు (19) అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ షాదాబ్ సహకారంతో సకాలంలో వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ …
Read More »ఏసిపి కార్యాలయం తనిఖీ
ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ఆర్మూర్ ఏ.సి.పి కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏ.సి.పి కార్యాలయంలో ముందుగా గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు, వారి సాదకబాదకాలు అడిగి తెలుసుకున్నారు. …
Read More »డబుల్ బెడ్ రూం ఇళ్ల లక్కీ డ్రా పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబల్ బెడ్ రూమ్ గృహాల లక్కీ డ్రాను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం జరిగే లక్కీ డ్రాకు లబ్ధిదారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి లక్కీ డ్రాను …
Read More »రక్త మోడిన జాతీయ రహదారి
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. కంటైర్ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారి చంద్రాయన్ పల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నాగపూర్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ను వెనుక నుండి కారు ఢీకొన్నది. …
Read More »నివేదికల ఆధారంగా చట్టంలో సంస్కరణలు తీసుకొస్తాం
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ కె తిరుమల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అంగన్వాడీ టీచర్స్, ప్రాంగణ ఎంఎస్డబ్ల్యు విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చట్టం అమలుతీరును పరిశీలించేందుకు దోమకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టును ఎంపిక చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నామన్నారు. …
Read More »ఇంటర్ విద్యార్థుల కోసం టెలి మానస్ 14416 టోల్ ఫ్రీ నెంబరు
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే …
Read More »ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ రవీందర్, జిల్లా అధికారులు రాజారాం, …
Read More »ప్రజావాణికి 69 ఫిర్యాదులు
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, డీఆర్డీఓ చందర్, నిజామాబాదు ఆర్దీఓ …
Read More »ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »