NizamabadNews

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్‌) పరీక్షలో 10,425 మంది విద్యార్థులకు గాను 9564 మంది హాజరయ్యారని, 861 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు తెలుగు సబ్జెక్ట్‌ పరీక్షలో ఇద్దరు, అరబిక్‌ సబ్జెక్ట్‌లో ఒకరు భీంగల్‌ సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాల …

Read More »

ఎడపల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ నమోదు

ఎడపల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందవచ్చని ఆరోగ్య మిత్ర విద్యావతి తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు నమోదు కార్యక్రమంలో ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు నమోదు వల్ల చేకూరే ప్రయోజనాలు తెలియజేస్తూ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, …

Read More »

ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్‌ వాయి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గత మూడు రోజులుగా మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయ అర్చకులు రాజమౌళి, శంకర్‌, గంగన్న అధ్వర్యంలో మొదటి రోజు పల్లకి సేవ, అగ్నిహోమం, పూర్ణాహుతి శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, ఒడిబియ్యం, పూర్ణాహుతి, రెండవ రోజు స్వామివారికి విశేషా అభిషేకాలు స్వామివారిని గ్రామములో రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని …

Read More »

కెసిఆర్‌ జన్మదినం సందర్బంగా రక్తదానం శిబిరం

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ సేవాదళ్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తల సేమియా సికిల్‌ సెల్‌ సొసైటీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఐ.వి.ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి …

Read More »

ఎర్రజొన్న కొనుగోళ్లలో బైబ్యాక్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల్లో రైతులు సాగు చేసిన ఎర్రజొన్న పంటను బైబ్యాక్‌ ఒప్పందానికి అనుగుణంగా సీడ్‌ వ్యాపారులు కొనుగోలు చేసేలా క్షేత్ర స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి …

Read More »

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ స్థాయిలో ఆరోగ్య పోషణ రోజును ప్రతినెల మొదటి వారంలో జరిగే విధంగా ఐసిడిఎస్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం పోషణ అభియాన్‌ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మార్చి నెలలో 15 రోజులపాటు పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. …

Read More »

ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని స్పీకర్‌ పోచారం నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నాయకులతో కలిసి కేక్‌ కట్‌చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కొరకు అనునిత్యం పాటుపడుతూ కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారన్నారు. …

Read More »

46 వాహనాలు సీజ్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిజిల్లా వ్యాప్తంగా పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న 4725 వాహనాలలో, గురువారం జరిగిన వాహన తనిఖీ కార్యక్రమంలో 46 వాహనాలను తనిఖీ చేసి, అక్కడికక్కడే సీజ్‌ చేసినట్టు జిల్లా రవాణా శాఖ అధికారిణి డాక్టర్‌ ఎన్‌ వాణి తెలిపారు. పన్ను చెల్లించని వాహనాల యజమానులు స్వచ్చందంగా వచ్చి త్రైమాసిక పన్నులు చెల్లించిన ఎడల ఇప్పటి వరకే విధించిన జరిమానా (పెనాల్టీ) …

Read More »

ధాన్యం కొనుగోలు కోసం ప్రణాళిక సిద్దం చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి 2023 ధాన్యం కొనుగోలు కోసం జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ, మార్కెటింగ్‌, ఐకెపి, సివిల్‌ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చే ధాన్యం దిగుబడిని అంచనా వేయాలని …

Read More »

మహిళా దినోత్సవం సందర్బంగా దరఖాస్తుల ఆహ్వానం

కామరెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత, ఆర్ధిక సామాజిక రంగాల్లో అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా సంక్షేమ ఆధికారి పి .రమ్య పేర్కొన్నారు. మార్చి 8 న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సామాజిక, ఆర్ధిక సాధికారత రంగాల్లో అసాధారణమైన పరిస్థితులలో అత్యుతమంగా పని చేసిన మహిళా సాధకులకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »