NizamabadNews

ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్‌ మృతుని శవపేటిక

వేములవాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుబాయి నుంచి వచ్చిన మృతుని శవపేటికను మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు ఇంటిముందు ఉంచి గల్ఫ్‌ కార్మికులు నివాళులు అర్పించిన సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. ఈ సందర్బంగా గల్ఫ్‌ జెఏసి చైర్మన్‌ గుగ్గిల్ల రవిగౌడ్‌తో సహా మరికొందరు కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కథలాపూర్‌ …

Read More »

50వసారి రక్తదానం చేయడం అభినందనీయం..

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రానికి చెందిన మానస 25 గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ వైద్యశాల బాన్సువాడలో అత్యవసరంగా ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి …

Read More »

బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో అమర సైనికులకు నివాళి

బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 సంవత్సరం ఫిబ్రవరి 14 న పుల్వమా వద్ద ముష్కరుల ఘాతుకానికి బలైన నలభై మంది అమర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మౌన ప్రదర్శన నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాము రాథోడ్‌ మాట్లాడారు. ఉగ్రవాదుల దొంగ దెబ్బకు బలైన అమర …

Read More »

మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన…

బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి మత్తు పదార్థాలను వినియోగించి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సాయికిరణ్‌, రేణుక ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ మత్తుపదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని మాట్లాడారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ …

Read More »

బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా గోస బీజేపీ భరోసాలో బాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మచారెడ్డి మండలంలోని ఏళ్ళంపెట్‌, వొడ్డెగూడెం, మర్రితండా, బంజేపల్లీ, నెమలి గుట్ట తండా, సర్థాపూర్‌ తండా, సోమారిపెట్‌, రత్నగిరి పల్లి, గ్రామాల్లో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల …

Read More »

రైతులు స్వయం సమృద్ధి చెందడమే ఎఫ్‌పివోల లక్ష్యం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో వ్యవసాయం రంగం కీలకమైనదని దాని మీద ఆధారపడి భూమిని నమ్మిన సన్న చిన్న కారు రైతులు వ్యవసాయం చేస్తున్నపుడు భూమికి ఎపుడు ఏమి కావాలని అడుగుతు సకాలంలో దానికి అవసరం అయినవి అందిస్తూ ఎన్ని ఇబందులు ఉన్న అందులో వచ్చే ఫల సాయంతో బతుకుతున్నారు, అలాంటి వారిని స్వయం సమృద్ధి పరచడం, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాడడం …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు …

Read More »

ఆర్ధిక అక్షరాస్యత గోడప్రతులు ఆవిష్కరించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు వీలుగా భారత రిజర్వ్‌ బ్యాంకు రూపొందించిన గోడప్రతులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమావారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ, సరైన ఆర్ధిక వ్యవహారాలు నిర్వహించడం సురక్షితం, ఎంతో శ్రేయస్కరం అని ప్రజల్లో అవగాహన కల్పించాలనే …

Read More »

ఉత్సాహంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్‌ స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ – 2023 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభ కార్యాక్రమం జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంత్‌, పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ పరేడ్‌ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ …

Read More »

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్‌ సే హత్‌ జోడో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు హత్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »