NizamabadNews

కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. మోపాల్‌ మండలంలోని ముదక్‌పల్లి, న్యాల్కల్‌ గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును ఒక్కో టేబుల్‌ వారీగా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని దృష్టి లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. …

Read More »

ఆడపిల్లలు సమాజానికి మణిహారం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్లో జిల్లా మహిళ, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో (బిబిబిపి పథకంలో భాగంగా) పెద్ద ఎత్తున జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్న గారి విటల్‌ రావు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో బాలికలను ఉన్నత చదువులు …

Read More »

ఏసీడి చార్జీలు చెల్లించకండి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎసిడి పేరుతో ప్రజల నుండి వసూలు చేస్తున్న అదనపు కరెంటు బిల్లుకు నిరసనగా మంగళవారం పవర్‌ హౌస్‌ వద్ద ధర్నా నిర్వహించి సుపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రవీందర్‌కి మెమోరాండం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు …

Read More »

బందుకు సహకరించిన వ్యాపారస్తులకు ధన్యవాదాలు

బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16న బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ బందుకు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. కాగా బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బిజెపి నియోజకవర్గ నాయకులు మల్యాద్రి …

Read More »

కన్యకాపరమేశ్వరి ఆలయానికి రూ. 1.50 లక్షల విరాళం

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ముఖద్వారానికి ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 1 లక్ష 50 వేల రూపాయలను మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఐవిఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ గుప్తా, వాసవి ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ మాది మాజీ అధ్యక్షుడు …

Read More »

ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గూపన్‌ పల్లి గంగస్థాన్‌ 2 శ్రీ రేణుక మాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం, శ్రీ రేణుక మాత దేవాలయంలో రూ. 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి, వంట గదుల నిర్మాణం కోసం రాష్ట్ర ఆర్టిసి కార్పొరేషన్‌ చైర్మన్‌ నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్‌ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో …

Read More »

సంక్షేమ పథకాల పితామహుడు ‘ కేసీఆర్‌’

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును టిఎస్‌ ఆర్టిసి చైర్మన్‌ నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్‌ మంగళవారం జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన పి. గంగు (మహేందర్‌ భార్య) కి రూ. ఒక లక్ష చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) …

Read More »

బంజారాల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ఘనత రాంరావు మహారాజ్‌దే

బాన్సువాడ, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజరులను ఆధ్యాత్మికత వైపు మంచి మార్గంలో నడిచే విధంగా కృషి చేసిన ఘనత రామారావు మహారాజ్‌ కి దక్కుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ తండాలో బంజారా గురువు రామారావు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు నిర్జీవంగా మారాయి. ఇద్దరు చిన్నారులు, తల్లి బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన తల్లి తన ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముగ్గురి ప్రాణాలు పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి… నిజామాబాద్‌ జిల్లా …

Read More »

26 నుండి ఎల్లారెడ్డిలో ‘‘హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర’’

ఎల్లారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డపల్లి సుభాష్‌ రెడ్డి మాట్లాడారు. రాహుల్‌ గాంధీ దేశంలో కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన ‘‘భారత్‌ జోడో యాత్ర’’కు అనుసంధానంగా రాహుల్‌ గాంధీ సందేశాన్ని నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »