NizamabadNews

అభివృద్ధిలో దేశానికే ఆదర్శం తెలంగాణ

బాల్కొండ, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ …

Read More »

ఆలూరు క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలంలోని ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్‌ సంఘం క్యాలెండర్‌ 2023ను పియుసి చైర్మన్‌ మరియు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, పిఏసిఎస్‌ చైర్మన్‌ కళ్ళెం భోజ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ చేపూర్‌ రాజేశ్వర్‌, సంఘం డైరెక్టర్లు కళ్ళెం సాయ రెడ్డి, బార్ల సంతోష్‌ రెడ్డి, ఇంగు …

Read More »

నిస్వార్ధ రక్తదానం అభినందనీయం…

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి …

Read More »

జిల్లాస్థాయి టిఎల్‌ఎం మేళాకు బుక్కరజని ఎంపిక

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం మల్లు పేట్‌ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని మండల స్థాయిలో నిర్వహించిన టిఎల్‌ఎం మేళాలో ఆంగ్ల విభాగంలో ఉత్తమ బోధనోపకరణాలను రూపొందించినందుకు గాను జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రదర్శనకు గాను ప్రశంసా పత్రాన్ని మండల విద్యాశాఖ అధికారి యోసఫ్‌, నోడల్‌ అధికారి ప్రేమ్‌ దాసులు అందజేసి …

Read More »

7న ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘‘పరాక్రమ్‌ దివస్‌’’ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు 15సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు ఉండాలని, కేవలం 5 నిమిషాల లోపే ఉపన్యాసన్ని పూర్తి చేయాలని …

Read More »

కామారెడ్డికి చేరుకున్న ఎన్నికల సామాగ్రి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంకు 1429 బ్యాలెట్‌ యూనిట్లు, 1017 కంట్రోల్‌ యూనిట్లు బుధవారం వచ్చాయి. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పర్యవేక్షణలో గోదాంలో నిల్వ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి, శీను, తహసిల్దార్లు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read More »

కళ్లద్దాల కోసం గొడవ… ఫర్నిచర్‌ ధ్వంసం…

ఎడపల్లి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంలోని వెటర్నరీ హాస్పిటల్‌లో జంలం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశాడు. ఈ మేరకు వెటర్నరీ అసిస్టెంట్‌ సమీయుద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంలం గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకుడు దొడ్డి శ్రీనివాస్‌ మంగళవారం వెటర్నరీ ఆసుపత్రిలో పనిచేసే వెటర్నరీ అసిస్టెంట్‌ సంయుద్దీన్‌కు …

Read More »

మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం

హైదరాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి సంక్షేమం మరియు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి గంగుల మల్లయ్య (87) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి, బుధవారం కరీంనగర్‌లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్‌ మంత్రి గంగులకు ఫోన్‌ …

Read More »

ఆడబిడ్డ పెళ్ళి భారం కాకూడదనే కళ్యాణలక్ష్మి

భీంగల్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ పథకం ప్రవేశ పెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. భీంగల్‌ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు 1కోటి 20 లక్షల పైగా విలువ చేసే కళ్యాణ లక్ష్మి, …

Read More »

అత్యాధునిక సౌకర్యాలతో ఆర్‌టిసి బస్సులు

హైదరాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన టిస్‌ ఆర్టీసి ఏసి, నాన్‌ ఏసి స్లీపర్‌ బస్సులను స్థానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విసి సజ్జనార్‌తో కలిసి టిస్‌ ఆర్టీసి ఛైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో రాష్ట్రంలో తొలిసారిగా టిఎస్‌ ఆర్టిసి సంస్థ ఏ.సి, నాన్‌ ఏ.సి. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »