నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశా వర్కర్ల ఆందోళనలో భాగంగా వంటావార్పు చేస్తూ సోమవారం రాత్రి చలిలో మహిళలంతా ధర్నా చౌక్ లోనే నిద్రించి తమ నిరసన తెలిపారు. మంగళవారం రెండవ రోజు కూడా పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు తమ సమస్యలపై నినాదాలతో ధర్నా చౌక్ను హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు …
Read More »అలసత్వం ప్రదర్శించే వారిపై వేటు తప్పదు
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని వైద్యాధికారుల వరకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత నవంబర్ మాసంలో జిల్లాలో మొత్తం 2784 కాన్పులు జరుగగా, అందులో 57 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, …
Read More »తెలంగాణలో భవిషత్తు బీజేపిదే
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ కామారెడ్డి, జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్ స్థాయి కార్యకర్తలే అని, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ …
Read More »పారిశుద్ధ్యం, హరితహారం నిర్వహణ మరింత మెరుగుపడాలి
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్, హరితహారం నిర్వహణను మరింతగా మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అంశంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా హరితహారం కింద …
Read More »రూ.23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ సెంటర్
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయు స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. రూ.23.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భవన నిర్మాణానికి భూమి …
Read More »పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి, దూస్గాం గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న మన ఊరు -మన బడి పనులను …
Read More »బీజేపీకి తెలంగాణలో చోటు లేదు
ఆర్మూర్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్,బీజేపీ నేత జక్కం పొశెట్టితో పాటు మరి కొందరు నాయకులు బిజెపిని వీడి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నెం.12 లోని మినిస్టర్ క్వార్టర్స్లో …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత…
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన శ్రీనివాస్ క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్ లోని గాంధీ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మెదక్ జిల్లా శెట్టిపల్లి కలాన్ గ్రామానికి చెందిన రాజేంద్రనగర్లో అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్న జంగిటి …
Read More »బాలల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి
ఎడపల్లి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కులతో పాటు వారి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీపీ శ్రీనివాస్, ఏసిడిపిఓ జానకి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్, ఏసిడిపిఓ జానకి మాట్లాడారు. చదువుకు దూరంగా ఉన్న పిల్లలు, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్నవారు, ఇటుక బట్టీలలో …
Read More »క్రీడాకారులను అభినందించిన ప్రిన్సిపాల్
బాన్సువాడ, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16 17 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన డిగ్రీ కళాశాల జట్టును సోమవారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాననికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 23న చెన్నైలోని అమితి యూనివర్సిటీలో జరిగే …
Read More »